సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైఖేల్’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. నారాయణ్ దాస్ నారంగ్ సమర్పణలో భరత్చౌదరి, పూస్కుర్ రామ్మోహన్ రావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.